ఓటీటీలో విడుదలై ప్రజాదరణ పొందుతున్న చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. విజయ్ రాజ్కుమార్, నేహా పతన్, అమితా రంగనాథ్ ప్రధాన పాత్రధారులు. భరత్ మిత్ర దర్శకుడు. నవీన్ కురువ, కిరణ్ కురువ నిర్మాతలు. ఓటీటీలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘నా నిర్మాత నవీన్ వల్లే ఈ సినిమా నేను తీయగలిగాను.
ఒక చిన్న ఊరిలో బట్టలకొట్టు పెట్టుకొని దాంట్లో వచ్చిన లాభాలను పైసా పైసా దాచి, ఈ సినిమా తీశారు. సినిమాను ఓటీటీలో పెద్ద హిట్. విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు. ఇంకా ఆమని, రాజీవ్ కనకాల, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్ అడివి, సంగీతం: గోపీసుందర్, నిర్మాణం: యెన్విఆర్ ప్రొడక్షన్స్, సిద్స్ క్రియేటివ్ వరల్డ్.