అధికార దాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో 2014కు ముందు రోజులు వచ్చాయన్నారు. 65 ఏండ్లు దే శాన్ని ఎలా పాలించారో.. ఇప్పుడు కూడా తెలంగాణలో అలాగే ఉన్నది. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలొస్తాయని చెప్పినట్టుగానే జరుగుతున్నది. రైతాంగం కరెంటు లేక తీవ్ర ఇబ్బందు లు ఎదురోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆరు గ్యారెంటీల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా మిగతా వాటిని సీఎం రేవంత్రెడ్డి గాలికొదిలేశా రు. ఎన్నికల వేళ రైతుల కోసం ఉంచిన రూ. 7,500కోట్ల రైతుబంధు నిధుల్ని తన ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులకు పంచిన ఘనత రేవంత్కే దక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే మళ్లీ మనం చీకట్లో కి వెళ్లాల్సిందే.
ఎంపీ అభ్యర్థిగా నిలిచిన నన్ను మ రోసారి ఆశీర్వదిస్తే జిల్లా అభివృదితోపాటు కాం గ్రెస్ అసమర్థ పాలనను ఎండగట్టేందుకు పార్లమెంట్లో పాలమూరు గళాన్ని వినిపిస్తా. బీజే పీ అక్షింతలను పంచుతూ ప్రచారం చేస్తోంది. ఆ పార్టీపై మాట్లాడితే నాపై కూడా ఈడీ, ఐటీ దాడులు నిర్వహించేందుకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉంటారు. చిన్న చిన్న పొరపాట్ల తో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయాం. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి కాం గ్రెస్ నిరంకుశ పాలనను ఎండగడుతాం. మే 13 న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒకరూ కారు గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.