న్యూఢిల్లీ, ఆగస్టు 8: గౌర్మెట్ గ్రాసరీ మార్కెట్లోకి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్రవేశించింది. తమ క్విక్ కామర్స్ విభాగం ‘మినట్స్’ ద్వారా ఈ సేవల్ని అందిస్తున్నది. ఇప్పటికే పోటీ సంస్థలైన బ్లింకిట్, జెప్టో ఈ తరహా సరుకుల డెలివరీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ప్రీమి యం, స్పెషాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్ను ఇకపై మినట్స్ ద్వారా యూజర్లు అందుకోవచ్చు.