Iran | అమెరికా(America) తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు హర్మూజ్ సంధిని తిరిగి తెరవబోమని ఇరాన్(Iran )భద్రతా చీఫ్ మొహమ్మద్-బఘేర్ జోల్ఘదర్(Mohammad-Bagher Zolghadr ) తేల్చి చెప్పారు. తన రాజీనామా వార్తలు వెలువడిన తర్వాత తొలిసారిగా ఆయన స్పందించారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అయిన జోల్ఘదర్, అమెరికా ప్రవర్తనను సరిదిద్దుకోవడం అంటే, ఇరాన్ దాని మిత్రదేశాలపై బెదిరింపులు, సైనిక చర్యలను ఆపడం, నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి ఇరాన్ డిమాండ్ల పరంపరను నెరవేర్చడమేనని ఆయన పేర్కొన్నారు.
అలాగే నౌకా దిగ్బంధం ఎత్తివేయాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ దేశాన్ని భవిష్యత్తులో ఎప్పుడు బెదిరించకూడదు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి సైన్యాన్ని ఎత్తివేయాలి. తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులను ఇరాన్ విధించింది. యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించాలి, ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యుద్ధంలో అయినా చర్చలలో అయినా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్నటికీ వెనకడుగు వేయదు అని ఆయన అన్నారు. కాగా, ఇరాన్ తాజా ప్రతిపాదనలపై అమెరికా ఇంకా స్పందించలేదు.