ముంబై, ఆగస్టు 8: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు బంగారం తనఖాపై ఇచ్చిన రుణాలు ఈ ఏడాది జూన్ ఆఖరునాటికి రూ.3.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితంతో పోల్చితే 69.3 శాతం పెరిగాయి. నిరుడు జూన్ ఆఖరుకల్లా రూ.2.02 లక్షల కోట్లుగా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు చెప్తున్నాయి. మరే ఇతర రుణాల్లో ఈ స్థాయి వృద్ధి లేదని కూడా ఆర్బీఐ చెప్పడం గమనార్హం. కాగా, 2024 జూన్ చివరినాటికి రూ.1.44 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక ఎన్బీఎఫ్సీలు ఇచ్చే రిటైల్ లోన్లలో గోల్డ్ లోన్లతోపాటు హౌసింగ్, వాహన రుణాలూ ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకూ రుణాలు పెరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కానీ పారిశ్రామిక రుణాలు మాత్రం మందగించినట్టు తేలింది.