సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు..యోగాతో ఎలా ప్రశాంతంగా ఉండాలో చెప్తానంటోంది రకుల్ ప్రీత్ సింగ్. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా యోగా టిప్స్ ను షేర్ చేస్తుంటుంది రకుల్. తాజాగా సైజ్ జీరో భామ కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో చాలా మంది ఒత్తిడి, యాంగ్జైటీకి లోనవుతున్నారు. కోవిడ్ ఒత్తిడి వల్ల చాలా మంది భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుంచి విముక్తి పొందేలా కొత్త యోగాసనాన్ని అందరి పరిచయం చేసింది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు యోగ్ నిద్ర ఆసనంతో ఒత్తిడి, యాంగ్జైటీకి దూరమై రిలాక్స్ అవ్వొచ్చని చెప్పింది. మ్యాట్ పై సమాంతరంగా పడుకొని రిలాక్స్ అవుతూ యోగ్ నిద్రకు సంబంధించిన స్టిల్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
నేను నిద్రపోవడ లేదు.. నా వెల్ నెస్ నిపుణుడు మున్మున్ గనేరివాల్ సూచించిన విధంగా, యోగ్ నిద్ర సెషన్ తో.. నేను ఇలా విశ్రాంతి తీసుకుంటాను. కోవిడ్ మహమ్మారి ఆందోళన మిమ్మల్ని నిద్రలేకుండా, ఒత్తిడికి గురిచేస్తుంటే , మీరు కోవిడ్ నుంచి కోలుకుంటున్నట్టైతే యోగ్ నిద్ర చేయండని క్యాప్షన్ ఇచ్చింది రకుల్.
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?