Today History : భారతదేశం నౌకాదళంతో 1967 లో సరిగ్గా ఇదే రోజున తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి చేరింది. మరుసటి ఏడాది విశాఖపట్టణం చేరిన ఐఎన్ఎస్ కల్వరి.. 24 సంవత్సరాల పాటు విశేష సేవలందించింది. పాకిస్తాన్తో 1971 లో జరిగిన యుద్ధంలో కరాచీ ఓడరేవుతోపాటు అక్కడి నౌకలను బూడిద చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఐఎన్ఎస్ కల్వరి సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2017 లో రూ.500 విలువ చేసే పోస్టల్ స్టాంప్ను తీసుకొచ్చింది.
భారతదేశానికి చెందిన మొదటి జలాంతర్గామి అయిన ‘కల్వరి’ అప్పటి సోవియట్ యూనియన్ నుంచి భారతదేశానికి వచ్చింది. 91 మీటర్ల పొడవు ఉండే ఈ జలంతార్గామి.. సముద్రం నీటి అడుగున గంటకు 28 కిలీమీటర్ చొప్పున ప్రయాణించడం దీని ప్రత్యేకత. భారత నౌకాదళంలో చేరిన నాలుగు సంవత్సరాల తర్వాత.. ఈ జలాంతర్గామి 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తన శక్తి ఏపాటిదో లోకానికి చూపించింది. ఈ యుద్ధంలో కరాచీ ఓడరేవును వరుస బాంబులు వేసి ధ్వంసం చేయడంలో కీలకపాత్ర పోషించింది. దాదాపు 30 ఏండ్లపాటు దేశానికి సేవలందించిన తర్వాత 1996 మార్చి 31న నౌకాదళం నుంచి రిటైర్ అయింది. ఫ్రాన్స్ సహాయంతో స్వదేశీంగా తయారు చేసిన స్కార్పెన్ తరగతి జలాంతర్గామిని 2018లో నేవీలో చేర్చారు. దీనికి కూడా ‘కల్వరి’ అని పేరు పెట్టారు.
2019: ఢిల్లీలోని అనాజ్ మండి నివాస ప్రాంతంలోని స్కూల్ బ్యాగ్ తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం, 43 మంది దుర్మరణం
2019: ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎన్నికైన ఫిన్లాండ్కు చెందిన సన్నా మారిన్
2010: వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపిన మొదటి ప్రైవేట్ సంస్థ
2004: షాహీన్-1 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన పాకిస్తాన్
1987: అణ్వాయుధాల తగ్గింపు ఒప్పందంపై సంతకం చేసిన రోనాల్డ్ రీగన్-మిఖాయిల్ గోర్బచెవ్
1946: సినిమా నటి షర్మిలా ఠాగూర్ జననం
1935: సినిమా నటుడు, మాజీ ఎంపీ ధర్మేంద్ర జననం
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..