కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచ విద్యుత్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం సంభవించింది. పాల్వంచ మండలం సీతారాంపట్నం సబ్స్టేషన్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ ఉపకేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదవశాత్తు పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి మూడు ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపంతోనే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.