జైపూర్: అర్ధరాత్రి వేళ బైక్పై వెళ్తున్న ఓ ఎమ్మెల్యే అనుచరుడిని ఓ కానిస్టేబుల్ ఆపాడు. దీంతో అతడు వెంటనే ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ ప్రజాప్రతినిథి నా మనిషినే ఆపుతావా అంటూ కానిస్టేబుల్పై చేసుకున్నది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్లో ఆదివారం జరిగింది.
రాజస్థాన్లోని బన్స్వారాలో ఆదివారం రాత్రి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. అతడు తాను ఎమ్మెల్యే అనుచరుడినని, తననే ఆపుతావా అని గొడవకు దిగాడు. వెంటనే బన్స్వారా ఎమ్మెల్యే రమీలా ఖదియాకు ఫోన్చేశాడు. ఆమె నిమిషాల్లో అక్కడికి చేరుకున్నది. హెడ్కానిస్టేబుల్ నరేంద్రనాథ్తో వాగ్వాదానికి దిగింది. మొత్తానికి తన అనుచరుడిని అక్కడి నుంచి తీసుకెళ్లింది. అయితే కానిస్టేబుల్పై ఆ మహిళా ఎమ్మెల్యే చేయి చేసుకున్నది ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే దీనిపై స్పందించడానికి ఆ ఎమ్మెల్యే తిరస్కరించారు.