లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు చెందిన జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ (42) ఆదివారం రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తనను లిక్కర్ మాఫియా చంపేస్తుందేమోనని అంతకుముందు రోజు శనివారమే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఇంతలోనే దారుణం జరిగింది. శ్రీవాస్తవ అనుమానాస్పద మృతిని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని పేర్కొంది.