న్యూఢిల్లీ/ ముంబై: కరోనా మహమ్మారి వేళ శరవేగంగా దూసుకొచ్చిన బిట్కాయిన్ ( BitCoin ) సహా ఇతర క్రిప్టో కరెన్సీల నిర్వహణ, నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఊగిసలాట వైఖరి ప్రదర్శిస్తున్నదా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. దీనిపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తున్నది.
అయితే, క్రిప్టో కరెన్సీల నిర్వహణకు చట్టబద్ధంగా అనుమతులు ఇవ్వరాదన్న విషయమై కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అలాగని నిషేధం కూడా విధించరు. ఆర్బీఐ పూర్తిగా క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని కోరుతున్నది. కానీ ఇవి పెట్టుబడులకు ఒక సాధనంగా ఉంటాయని, వీటిని అనుమతించాలని ఆర్థికశాఖ వర్గాలు అంటున్నాయి.
ఈ నెల 19 నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షా కాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లు లేదు. దివాళా స్మృతిలో సవరణల బిల్లు, డిపాజిట్లపై బీమా కవరేజీ రూ.5 లక్షలకు పెంపు తదితర బిల్లులు ఏజెండాలో ఉన్నాయి.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో క్రిప్టో బిల్లును కేంద్ర ప్రభుత్వం చేర్చింది. కానీ కరోనా రెండో వేవ్ విజృంభించడంతో సమావేశాల రోజులు తగ్గిపోయాయి. ఫలితంగా క్రిప్టో బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టలేకపోయింది సర్కార్.
సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్బీఐ గవర్నర్
పెట్రో షాక్ : వాహన విక్రయాలకు ఎదురుదెబ్బ
బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
సొంతింటి కోసం హైదరాబాదీల పరుగులు.. గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు