న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). రూ.88.06 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనున్నది. లగ్జరీ, సౌలభ్యం కోరుకుంటున్నవారికి ఈ కారు సరైనదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ రూ.59 లక్షల నుంచి రూ.2.10 కోట్ల లోపు మోడళ్ళను విక్రయిస్తున్నది.