కొత్త కస్టమర్లకు కార్డులు ఇవ్వద్దంటూ నిషేధం
ముంబై, జూలై 14: మాస్టర్కార్డ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. డాటా స్టోరేజీ నిబంధనల అమలులో వైఫల్యం చెందిందంటూ కొత్తగా కస్టమర్లకు కార్డులు జారీ చేయరాదని వేటు వేసింది. ఈ నెల 22 నుంచి క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్ కస్టమర్లకు భారత్లో సేవలందించకుండా మాస్టర్కార్డ్ ఆసియా పసిఫిక్పై నిషేధం విధిస్తున్నట్లు ఆర్బీఐ బుధవారం స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం ప్రభావం.. ఇప్పటికే ఉన్న మాస్టర్కార్డ్ వినియోగదారులపై ఎంతమాత్రం ఉండబోదన్నది. పాత కస్టమర్లకు ఎప్పట్లాగే మాస్టర్కార్డ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ చెప్పింది. కాగా, నిబంధనలను పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా, అవకాశాలు ఇచ్చినా.. మాస్టర్కార్డ్ పట్టించుకోలేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ వివరించింది. ఈ క్రమంలో నిషేధం సమాచారాన్ని బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలకు మాస్టర్కార్డ్ తెలియపర్చాలని కూడా ఆదేశించింది.