న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ కమర్షియల్ వినియోగదారుల కోసం తాజాగా ‘ఎక్స్ప్రెస్’ బ్రాండ్ను పరిచయం చేసింది. విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ..ఈ బ్రాండ్తోనే త్వరలో ఎలక్ట్రిక్ సెడాన్ను అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ సమాయత్తం అవుతున్నది. ‘ఎక్స్ప్రెస్-టీ’ పేరుతో పిలువబడే ఈ కారు రెండు రకాల్లో లభించనున్నది.