ముంబై : బంగారం ధరలు గురువారం భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 48,439కి ఎగబాకాయి. కిలో వెండి రూ 320 భారమై రూ 69,732కి చేరింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమిచ్చే చర్యలు కొనసాగిస్తామని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెర్మి పొవెల్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు ఎగిశాయి.
ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1832 డాలర్లు పలికింది. ఇది 1833 డాలర్ల వద్ద నిలదొక్కుకుంటే బంగారం ధరలు మరింత పెరుగుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో మెరుగైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని మదుపరులు ఎంచుకుంటున్నారని దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.