గాంధీనగర్: కరోనాపై పోరులో గుజరాత్లోని విజయ్ రూపానీ సర్కార్కు అండగా నిలిచేందుకు దేశీయ అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (ఎంఎస్ఐ) ముందుకు వచ్చింది. అహ్మదాబాద్ జిల్లా సీతాపూర్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జైడస్ హాస్పిటల్స్తో కలిసి దీన్ని నిర్వహించనున్నది.
సీతాపూర్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం, నిర్వహణకు అయ్యే పెట్టుబడి వ్యయం రూ.126 కోట్లు అని అంచనా వేస్తున్నారు. ఆటో మేజర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఇన్షియేటివ్లో భాగంగా మారుతి సుజుకి ఫౌండేషన్ వందశాతం నిధులు సమకూరుస్తుంది.
జైడస్ గ్రూప్ సీఎస్ఆర్ విభాగం రామన్భాయి ఫౌండేషన్ ఈ దవాఖాన పూర్తి నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కరోనాపై పోరులో భాగంగా రామన్భాయి ఫౌండేషన్ కొవిడ్-19 రోగులకు దవాఖాన నిర్వహిస్తున్నది.
తాము కార్ల ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించినప్పుడు ఈ రీజియన్ పరిధిలో ప్రధాన మెడికల్ వసతులే లేవని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో హెల్త్కేర్ రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న వారి భాగస్వామ్యంతో ఈ ప్రాంత వాసులకు లబ్ధి చేకూర్చేందుకు మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మించాలని నిర్ణయించామన్నారు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో తమ ఉత్పత్తి యూనిట్ను కొవిడ్ కేర్ ఫెసిలిటీగా మార్చినప్పుడే దవాఖాన నిర్మించాలని నిర్ణయించడం యాద్రుచ్చికం అని కెనిచి అయుకవా పేర్కొన్నారు. దీనివల్ల సీతాపూర్, దాని చుట్టుపక్కల గ్రామాల్లో 3.75 లక్షల మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
50 బెడ్ల వసతితో దవాఖానను ప్రారంభించనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. డిమాండ్ మేరకు దాన్ని 100 పడకలకు పెంచనున్నది. ఇప్పటికే విస్తరణకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయన్నది.
7.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ దవాఖాన ఏర్పాటైంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయని మారుతి సుజుకి తెలిపింది.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ కరోనా సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..
క్రెడిట్ కార్డుల వాడకంతో ఇలా రివార్డు పాయింట్లు..!
అత్యంత ఖరీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..
పీపీఎఫ్లో రూ.12 వేల మదుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..