రియాద్ : అమెరికా-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎర్ర సముద్ర తీరంలోని హోడెయిడా నగరంపై సౌదీ వైమానిక దాడులు చేసింది. దీంతో యెమెన్లోని తిరుగుబాటు దారులు హౌతీలు సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడ్డారు.
యాన్పు, జిజాన్లోని అతిపెద్ద అరమ్కో చమురు స్థావరాలపై దాడులు జరిపనట్టు హౌతీలు ప్రకటించారు. ఎర్ర సముద్రంలో దిగ్బంధనాన్ని ప్రకటించారు. యెమెన్ఫై దిగ్బంధనం ఎత్తేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామని తెలిపారు.