తెలుగు సినిమాలోనే అత్యంత పొడవైన టైటిల్తో వస్తున్న చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, డోల్ రవి మొదలగువారు’. చంద్రసిద్ధార్థ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ట్రైలర్ను అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ ఇదని, సంగీతం…ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని చర్చిస్తూ కథ సాగుతుందని మేకర్స్ తెలిపారు. టైటిల్కు మంచి రెస్పాన్స్ వస్తున్నదని, విభిన్నమైన థ్రిల్లర్ ఇదని దర్శకనిర్మాత చంద్రసిద్ధార్థ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ: మదన్, సంగీతం: జే రెక్స్, మాటలు: పులగం చిన్నారాయణ, నిర్మాత, స్క్రీన్ప్లే, దర్శకత్వం: చంద్రసిద్ధార్థ.