న్యూయార్క్ : క్రిప్టోకరెన్సీపై ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ మరోసారి ఆసక్తిని వెల్లడించారు. ప్రపంచంలో ప్రతి విషయాన్ని బిట్ కాయిన్ మెరుగ్గా మార్చివేస్తుందని టెక్ బిలియనీర్ ట్వీట్ చేశారు. క్రిప్టోకరెన్సీని మెరుగుపరిచేందుకు తాను పనిచేస్తానని ట్విట్టర్ సీఈఓ స్పష్టం చేశారు. జాక్ మరో కంపెనీ స్క్వేర్ సైతం బిట్ కాయిన్ పట్ల ఆసక్తి చూపుతోంది.
కంపెనీ బిట్ కాయిన్ వ్యూహంలో ఎలాంటి మార్పు లేదని, బిట్ కాయిన్ క్లీన్ ఎనర్జీ కార్యక్రమం వంటి పలు చర్యలతో క్రిప్టోకరెన్సీని మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపడతామని స్క్వేర్ సీఎఫ్ఓ అమ్రుత అహుజా పేర్కొన్నారు. బిట్ కాయిన్ పెట్టుబడులను ఎప్పటికప్పుడు కంపెనీ సమీక్షిస్తుందని ఆమె వెల్లడించారు.