న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.333 పెరిగి రూ.47,833కు పెరిగింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,500 వద్ద ముగిసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ భారీగా పెరిగాయి. ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.2,021 పెరిగి రూ.73,122కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.71,101 వద్ద ముగిసింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,869 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 28.48 అమెరికన్ డాలర్లు పలికింది.