(ATM Charges) హైదరాబాద్ : ఇప్పటికే వినియోగదారులపై పలు ఆంక్షలు విధించిన బ్యాంకులు.. తాజాగా ఏటీఎం లావాదేవీలపై విధించే ఛార్జీలను పెంచనున్నాయి. ఇకపై అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చేసే ప్రతీ లావాదేవీలపై రూ.21 ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలు ఇప్పటివరకు రూ.20 గా ఉన్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.
ఖాతా కలిగి ఉన్న బ్యాంకుల ఏటీఎంల నుంచి వినియోగదారులు ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) పొందేందుకు అర్హులు. ఇదే మాదిరిగా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. మెట్రో సెంటర్లలో 3 లావాదేవీలు, నాన్ మెట్రో సెంటర్లలో 5 లావాదేవీలకు పరిమితం చేశారు. ఈ ఏడాది జూన్లో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కొత్త రేట్లు ఉన్నాయి. ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్చేంజ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి.. ఏటీఎం ఛార్జీలు, ఫీజులను సమీక్షించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షతన 2019 జూన్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా ఏటీఎం లావాదేవీల ఛార్జీలను సవరించినట్లు తెలుస్తున్నది.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..