(IIITDM seminor) కర్నూలు: జిల్లా కేంద్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో మూడు రోజులపాటు జరుగనున్న 5వ అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ-2021 (సీఐసీటీ) సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఐఐఐటీడీఎం కర్నూలుతోపాటు అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురం ఈ సదస్సును నిర్వహించాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) తరపున ఐఈఈఈ హైదరాబాద్ ఈ సదస్సును స్పాన్సర్ చేసింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఐఐటీడీఎం కాంచీపురం చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ సదాగోపాలన్ హాజరై ప్రధానోపన్యాసం చేశారు. సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కర్నూలు ఐఐఐటీడీఎం ప్రొఫెసర్ డీవీఎల్ఎన్ సోమయాజులు స్వాగతోపన్యాసం చేశారు. భారతదేశం జీడీపీలో 13 శాతం ఐటీ రంగం నుంచి వస్తున్నదని వక్తులు చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అతుల్ నేగి మాట్లాడుతూ, భారతీయ పర్యావరణ సమాజానికి సంబంధించిన ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని సూచించారు. బెంగళూరు శాంసంగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్ఐ-బీ) ప్రొఫెసర్ వీ ఆర్ రత్నాకరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఐసీటీ టూల్స్, డెవలప్మెంట్పై అభిప్రాయాలను వెల్లడించారు.
పలువురు జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు తాజా సాంకేతిక పురోగతులు, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఆవిష్కరణలపై తమ ఆలోచనలను మార్పిడి చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ సంస్థల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐదు కీలక ఉపన్యాసాలతో సాంకేతిక సెషన్లు ఉంటాయి. పరిశ్రమల కనెక్షన్లు, ఇంజనీరింగ్ ఫోరంలలో మహిళలు, ట్యుటోరియల్లు, వర్క్షాప్లు, కోడింగ్పై కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసీఈ అధ్యాపకులు డాక్టర్ కృష్ణనాయక్ సదస్సు వివరాలను, నివేదికను సమర్పించారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..