గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి విద్యుత్ సబ్స్టేషన్ అగ్నిప్రమాదం సంభవించింది. వడ్డేపల్లిలోని శాంతినగర్ సబ్స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంద్ది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదం కారణంగా సబ్స్టేషన్ పరిధిలోని 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని విద్యుత్ అధికారులు వెల్లడించారు. కరెంటు సరఫరాను పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..