ముంబై : మహారాష్ర్టలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈతపల్లి ఫారెస్టు ఏరియాలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతమైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచి నక్సల్స్కు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.