Congress | తెలంగాణ కాంగ్రెస్లో (Congress )అగ్గి రాజుకుంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఎపిసోడ్తో ముదిరి పాకాన పడ్డాయి. సురేఖను టార్గెట్ చేస్తూ కొంతకాలంగా రేవంత్ రెడ్డి(CM Revanth reddy) శిబిరం పావులు కదుపుతున్నది. కొన్నిసార్లు అధికారిక కార్యక్రమాలకు సైతం మంత్రి సురేఖకు ఆహ్వానం లేకుండానే పనులు చేస్తున్నారు. కడియం శ్రీహరితో ఇదే విషయంలో పలుమార్లు మంత్రి గొడవ కూడా పడ్డారు. తాజాగా మంత్రి కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాని, వాటిన బయటపెడుతానని హెచ్చరించడంతో రేవంత్ రెడ్డి శిబిరంలో అలజడి మొదలైంది.
కొండా ఫ్యామిలీకి ఎలాగైన చెక్ పెట్టాలని ఉమ్మడ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో స్కెచ్ వేశారు. ఈ క్రమంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా, తనకు మద్దతు తెలుపుతూ మీటింగ్ పెట్టమని తన వర్గానికి రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్లో20 నుండి 30 మంది రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మీటింగ్కు ఎవరు వస్తారు? ఎవరు డుమ్మా కొడతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
మీటింగ్కు వచ్చిన వారు రేవంత్ రెడ్డి వర్గమని, రానివారు అంతా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గమని నిర్ధారణకు రావొచ్చంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తనకు మద్దతు ఇస్తున్న నాయకులకు ఫోన్లు చేసి, మనం కూడా మీటింగ్ పెట్టుకుందామని కొండా సురేఖ సిద్దమవుతున్నట్లు తెలిసింది. అటు సీఎం ఇటు మంత్రి సురేఖ వర్గీయులు రెండు వర్గాలుగా చీలిపోవంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.