శ్రీనగర్: ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. వందేమాతరం గీతం ఆ పార్టీల మధ్య వివాదాన్ని సృష్టించింది. జమ్మూకశ్మీర్లో సోమవారం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఆ సమయంలో వందేమాతర పూర్తి గీతాన్ని ప్లే చేశారు. ఎన్సీ నేతలు సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎన్సీ నేత ఫారూక్ అబ్దుల్లా.. ఆ సాంగ్ మొత్తం నిలబడి ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వందేమాతరం గీతం పూర్తిగా పాడిన సమయంలో నిలబడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వెల్లడించింది. తొలి చరణం పాడినప్పుడు మాత్రమే నిలబడి ఉంటే సరిపోతుందన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓ వీడియోను తన ఎక్స్లో పోస్టు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తికి విరుద్ధంగా వందేమాతరం సాంగ్ ఫుల్ వర్షన్ ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విధానానికి కట్టుబడి ఉండాలని ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ను కోరారు. కేసీ వేణుగోపాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేషనల్ కాంగ్రెస్ తప్పుపట్టింది. కూటమి పార్టీలకు కాంగ్రెస్ ఆదేశాలు ఇవ్వడం సరికాదు అని ఎన్సీ పేర్కొన్నది.
మరో వైపు కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ముస్లింగ్ లీగ్గా పేర్కొంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. కూటమిలో భాగస్వామికి హుకుం జారీ చేయడం సరికాదు అని, వేణుగోపాల్కు ట్వీట్ చేసే హక్కు ఉందని, కానీ దాన్ని తమపై రుద్దే అధికారం లేదని, ఇది ప్రజల ఇష్టం అని, ప్రజలపై ఆంక్షలు విధిస్తే తాము వ్యతిరేకిస్తామని ఎన్సీ నేత బాషిర్ అహ్మద్ తెలిపారు.
The full version of Vande Mataram sits uneasily with the syncretic and pluralist ethos that our freedom fighters envisioned and nurtured for India.
For us, the considered judgment of Mahatma Gandhi, Pandit Nehru, Sardar Patel, Subhash Chandra Bose, Rajendra Prasad, Acharya… pic.twitter.com/VngmVUmevz
— K C Venugopal (@kcvenugopalmp) September 8, 2026