నోయిడా: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో బాధితులు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు తీవ్రంగా కొరత ఏర్పడింది. దీంతో కరోనా సోకి ఆపదలో ఉన్న తమవాళ్లకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇప్పించాలని వారి కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమవారికి ఈ వైరల్ ఇంజెక్షన్ ఇప్పించాలని ఓ కుటుంబం చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) దీపక్ ఓహ్రీ కాళ్లపై పడి వేడుకున్నది. ఈ హృదయ విదారక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..