బెంగుళూరు: కర్నాటకకు చెందిన బీజేపీ అభ్యర్థి కే సుధాకర్(K Sudhakar)పై లంచం కేసు నమోదు అయినట్లు ఇవాళ ఎన్నికల సంఘం తెలిపింది. అతని వద్ద నుంచి 4.8 కోట్లు నగదును సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. చిక్కబల్లాపురాకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్ ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ వర్గాలు చెప్పాయి. కర్నాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. చిక్కబల్లాపురాలోని ఎఫ్ఎస్టీ బృందాలు 4.8 కోట్లు సీజ్ చేశాయని, మదనాయకల్లి పోలీసు స్టేషన్లో ఏప్రిల్ 25వ తేదీన కే సుధాకర్ పై కేసు నమోదు అయినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఐపీసీ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.