బెంగుళూరు: కర్నాటకలో ఇవాళ రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో మనకు దక్కే అవకాశం ఇదే అని ఆయన అన్నారు.
#WATCH | Rahul Dravid casts his vote in Karnataka’s Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1
— ANI (@ANI) April 26, 2024
కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. మైసూరులో ఓటేశారు. మైసూరు తాలుకలోని స్వగ్రామం వరుణలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైసూరు-కొడగు లోక్సభ నియోజవకర్గం కిందకు వస్తుంది. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుమారుడు డాక్టర్ ఎస్ యతీంద్ర పోలింగ్ బూత్కు వెళ్లారు.