Sudha Murty | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి (Sudha Murty) సైతం బెంగళూరు నియోజకవర్గం (Bengaluru constituency)లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘నేను అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. ఇంట్లో కూర్చోకండి. బయటకు వచ్చి ఓటు వేయండి. మీ నాయకుడిని ఎన్నుకోండి. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ ప్రజలు తక్కువ ఓటు వేస్తారని నేను ఎప్పుడూ భావిస్తుంటా. నేను యువతను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నా.. బయటకు వచ్చి ఓటేయండి’ అని సుధామూర్తి పిలుపునిచ్చారు.
కాగా, ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కర్ణాటకలో 14 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇక మొత్తం 13 రాష్ట్రాల్లో కలిపి 1,206 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు మ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
Also Read..
Google Doodle | రెండో విడత పోలింగ్.. గూగుల్ ప్రత్యేక డూడుల్ చూశారా..?
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ షురూ.. బరిలో రాహుల్, హేమమాలిని
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలు.. విద్యార్థుల అరెస్ట్తో అట్టుడుకుతున్న యూఎస్ వర్సిటీలు