టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్లో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ వీలునామా వెలుగులోకి వచ్చింది. తన ముగ్గురు పిల్లలతోపాటు పెంపుడు కుక్క, సహాయకురాలికి కూడా ఆస్తిలో వాటా ఇచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్లో భయంకర చలిగాలులు వీస్తున్నాయి. ఇక్కడి వాతావరణం కారణంగా 15 రోజుల వ్యవధిలోనే 157 మంది చనిపోయారు. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో మొత్తం123 మంది గిరిజన విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ కు సెలెక్ట్ అవ్వడం సంతోషకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
వన్డే ర్యాంకింగ్స్లో మన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ మెరిశారు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్లలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీలో నంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు. షమీ 11 వ ర్యాంకు పొందాడు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ రద్దయింది. జమ్ములో భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. రేపు గణతంత్ర దినం సందర్భంగా విరామం తీసుకుని 27 న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
బాలాకోట్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది నిజమే అని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఈ విషయాలను తన తాజా పుస్తకం ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్’ లో వివరంగా రాశారు.