హైదరాబాద్ : పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన కంటివెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతుందని ఆయన వివరించారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో ప్రధానమైనదని, కళ్లను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచించారు. డీజీపీ కార్యాలయ అధికారులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.
డీజీపీ కార్యాలయంలో కంటి వెలుగును ఏర్పాటు చేయాలని కోరిన మీదట సంబంధిత అధికారులు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు..