తిరుపతి : ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మహారాష్ట్రకు చెందిన 9 మంది భక్తులు తిరుమలకు చేరుకుని బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం తిరుపతి నుంచి బయలు దేరిన వీరు కాణిపాకం ఆలయానికి వెళ్తుండగా చంద్రగిరి మండం కల్రొడ్డుపల్లి వద్ద కారు కల్వర్టును ఢీకొని నలుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలు , ఒకరికి స్వల్ప గాయలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.