నల్లగొండ : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి దేవరకొండ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చందంపేట మండల కేంద్రంలో సకల సదుపాయాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటారు. ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె పగ్రతి కార్యక్రమం ద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయన్నాని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి జబ్బులు రావని, దోమల నివారణ ప్రధాన కార్యక్రమంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.