హైదరాబాద్ : తెలంగాణ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని చెప్పింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, నల్గొండతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.