బెంగళూరు: దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్తాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవుతు వస్తున్నాయి. అయితే ఏడాది తర్వాత మొదటి సారిగా మహారాష్ట్ర రెండో స్థానంలోకి వెళ్లింది. రోజువారీ కేసులు, మరణాల్లో మహారాష్ట్రను అధిగమించింది కర్ణాటక. కన్నడ రాష్ట్రంలో గత 24 గంటల్లో 39,305 కేసులు, 596 మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 37,236 మంది కరోనా బారినపడగా, 549 మంది మృతిచెందారు.
ఇక కరోనా రెండో వేవ్ దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,29,942 కేసులు నమోదవగా, 3,876 మంది మృతిచెందారు. మరో 3,56,082 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517కు చేరింది. ఇందులో 1,90,27,304 మంది డిశ్చార్జీ అవగా, 2,49,992 మంది మరణించారు. మరో 37,15,221 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి