ఇటీవలి కాలంలో చిరంజీవి తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు సపోర్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటున్నారనే విషయం అర్ధమవుతుంది. సోషల్ మీడియా ద్వారా మంచి సినిమాలపై ప్రశంసలు కురిపించడం, కరోనా బారిన పడిన వారి ఆరోగ్యం కుదుట పడాలని ట్వీట్స్ చేయడం మన గమనించవచ్చు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడగా, ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు తన ట్వీట్లో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాను. మీకు బలం చేకూరాలి. మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్- మహేష్ మంచి స్నేహితులు కాగా, ఆ మధ్య మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ఆడియో వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాదు పలు సందర్భాలలో వీరు కలిసి పార్టీలు కూడా జరుపుకున్నారు.