తెలంగాణ సైకాలజిస్టుల ఉచిత కౌన్సెలింగ్
ఉదయం 11 నుంచి సాయంత్రం 3 దాకా సేవలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ ): మానసికంగా ఆందోళన చెందుతున్నారా? కొవిడ్ సోకుతుందనే ఆలోచనలు నిద్ర పోనివ్వడం లేదా? నెగెటివ్ ఆలోచనలే మెదడులో గూడుకట్టుకున్నాయా? రోజంతా కలవరం చెందుతున్నారా? కరోనా నేపథ్యంలో ప్రజల్లో గూడుకట్టుకున్న ఇలాంటి ఆందోళనలను దూరం చేసేందుకు తెలంగాణ సైకాలజిస్టులు ముందుకొచ్చారు. మానసిక ఆందోళనలు, ఒత్తిడిని ఏవిధంగా అధిగమించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ చేపట్టింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ మోతుకూరి రాంచందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 9 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయం త్రం 3 గంటల వరకు ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఈ సేవలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవచ్చని సూచించారు.