Nirmal Purja : ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుల్లో ఒకరైన నిర్మల్ పుర్జ (Nirmal Purja) మృతిచెందారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని బ్రాడ్ పీక్ (Broad Peak) పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో హిమపాతం (Avalanche) కారణంగా ఆయన మరణించినట్లు ఎలైట్ ఎక్స్పెడిషన్ సంస్థ ధ్రువీకరించింది. పుర్జా నేతృత్వంలో వెళ్లిన పది మంది పర్వతారోహకులు ఈ ప్రమాదంలో గల్లంతు కాగా.. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు.
నేపాల్లో జన్మించిన నిర్మల్ పుర్జా.. బ్రిటన్ గుర్ఖా బ్రిగేడ్లో మాజీ సభ్యుడిగా పనిచేశారు. పర్వతారోహణపై ఆసక్తి ఉన్న ఆయన ఎన్నో సాహసోపేత యాత్రలను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల మీటర్ల ఎత్తయినా 14 పర్వతాలను ఏడు నెలల్లోపే అధిరోహించి 2019 లో చరిత్ర సృష్టించారు. అనంతరం 2021 శీతాకాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించి ఘనత సాధించిన బృందంలోనూ పుర్జా ఒకరు. పుర్జా సాహసాలపై ‘14 పీక్స్ : నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’ పేరుతో నెట్ఫ్లిక్స్లోనూ డాక్యుమెంటరీ వచ్చింది.
కారాకోరం పర్వతశ్రేణుల్లో ఒకటైన బ్రాడ్ పీక్ 8051 మీటర్లతో ప్రపంచంలో 12వ ఎత్తయిన పర్వతంగా గుర్తింపు పొందింది. అత్యంత సవాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు పుర్జా నేతృత్వంలో పదిమంది యాత్రికుల బృందం బయలుదేరింది. ఏడు వేల అడుగుల ఎత్తులో ఉండగా భారీ హిమపాతం తాకడంతో వీరంతా గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు నేపాల్ వాసులు కాగా.. పాకిస్థాన్, ఒమన్, అమెరికా, చైనాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.