సిటీబ్యూరో: సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 2నుంచి 4వ తేదీ వరకు ఆలయం చుట్టూ రెండుకిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.
జాతర సందర్భంగా 1వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటల నుంచి 4వ తేదీ ఉదయం వరకు పొగాకుబజార్, హమాలీ విగ్రహం నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారులు, సుభాష్రోడ్ , హిల్ స్ట్రీట్, అడవియ్య క్రాస్రోడ్స్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే దారి, జనరల్బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే దారిని మూసివేస్తామని చెప్పారు. ముఖ్యంగా కర్బాలాక్రాస్రోడ్స్ వద్ద చిల్డ్రన్పార్క్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్వైపు మళ్లిస్తారు. రాణిగంజ్క్రాస్రోడ్స్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు కర్బాలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు,సాధారణ వాహనాలు రాణిగంజ్ క్రాస్రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్డు , గోపాలపురం లైన్ మీదుగా రైల్వేస్టేషన్కు వెళ్లాలి.