సరైన గుర్తింపు పత్రాలు లేవనో, కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదనో ఏ పేషంటునూ ప్రభుత్వ కరోనా చికిత్స దవాఖానలో చేర్చుకోవటానికి నిరాకరించవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా మధ్యస్థ లక్షణాలున్న పేషంట్లకు చికిత్సను అందించటానికి హాస్టళ్లు, హోటళ్లు, స్కూళ్లు, స్టేడియంలు, లాడ్జీలలోనూ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయటానికి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశామని వెల్లడించింది.