Malaysia : మలేషియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ బీఆర్ఎస్ నేతలు, MYTA సభ్యులతో కలసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ‘ఉద్యమకారుల పోరాటాలు, కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకుంటూ మలేషియా నగరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రజలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంద’ని గాదరి కిశోర్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై నాయకులు సురకంటి శ్రీనివాస్, మైటా అధ్యక్షుడు ఎస్.తిరుపతి, మైటా మహిళా అధ్యక్షులు కిరణ్మయి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉపేందర్ గౌడ్, పడాల సతీష్, మైటా, బీఆర్ఎస్ సభ్యులు మన్సూర్, సంతోష్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు.
