కోల్కతా: గతంలో పనిమనిషిగా పలు ఇళ్లలో పనులు చేసిన కలితా మాఝీకి అదృష్టం వరించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. (Kalita Majhi) సీఎం సువేందు అధికారి కేబినెట్లో సహాయ మంత్రిగా కలితా మాఝీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ‘మోదీజీ నన్ను ఈ ఉన్నత స్థానానికి తీసుకురావడం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నా. నేను ఎమ్మెల్యే అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇక మంత్రి అవుతానని అయితే అసలు ఊహించలేకపోయాను’ అని మీడియాతో అన్నారు.
కాగా, 2014 నుంచి బీజేపీ కోసం తాను పని చేస్తున్నట్లు కలితా తెలిపారు. ‘ నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు, నా దృష్టి కేవలం నా సొంత నియోజకవర్గంపై మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రిగా మొత్తం రాష్ట్ర బాధ్యత నా భుజాలపై ఉన్నది’ అని ఆమె అన్నారు.
🚨Rising from domestic help to Minister of State in West Bengal! Kalita Majhi’s inspiring journey proves democracy empowers everyone. “I want to work hard for the whole of Bengal,” she says. pic.twitter.com/QfCY5UP4IF
— indiainlast24hr (@indiain24hr) June 1, 2026
మరోవైపు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం పలు ఇళ్లలో పనిమనిషిగా ఆమె పనిచేశారు. ఒకప్పుడు నెలకు కేవలం రూ. 2,500 మాత్రమే సంపాదించారు. ఆమె భర్త ప్లంబర్గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ స్కూల్ విద్యార్థి.
అయితే గతంలో పలు ఇళ్లల్లో పనులు చేసిన కలితా మాఝీ తన రాజకీయ ప్రస్థానాన్ని బూత్ స్థాయి కార్యకర్తగా ప్రారంభించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్గ్రామ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా మంత్రి పదవి కూడా ఆమెను వరించింది.
🚨Rising from domestic help to Minister of State in West Bengal! Kalita Majhi’s inspiring journey proves democracy empowers everyone. “I want to work hard for the whole of Bengal,” she says. pic.twitter.com/QfCY5UP4IF
— indiainlast24hr (@indiain24hr) June 1, 2026