Khushi kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ 2018లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ జాన్వీకపూర్ ను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది జాన్వీకపూర్. ఇక ఈ సారి శ్రీదేవి చిన్న కూతురు, జాన్వీ సోదరి ఖుషీకపూర్ ఇండస్ట్రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది.
ఖుషీకపూర్ ను కూడా కరణ్ జోహార్ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈ సారి కరణ్ జోహార్ తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీలో ఖుషీ కపూర్ ను లాంఛ్ చేస్తాడని బీటౌన్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఖుషీ కపూర్ ప్రస్తుతం యూఎస్ఏలో యాక్టింగ్ కోర్సు చేస్తోంది. జాన్వీకపూర్ తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటుండగా..మరి ఖుషీ కపూర్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా అలరిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
పాపం పవర్ స్టార్ను ఎవరూ పట్టించుకోవడం లేదట!