Manda Jagannatham | నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. పార్టీ బీఫామ్ సమర్పించకపోవడంతో నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. జగన్నాథం బీఎస్పీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన బీఫామ్ ఇవ్వకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో నాలుగో విడుతలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. గురువారంతో నామినేషన్ల స్వీకరణ ముగిసిన విషయం తెలిసిందే. శుక్రవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల విత్డ్రాకు చివరి తేదీ కాగా.. మే 13న ఎన్నికలు.. జూన్ 4న ఫలితాలను ప్రకటించనున్నారు.