న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచి ఆర్థిక రంగంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకింగ్, టాక్స్ ఈ-ఫైలింగ్ విధానాల్లో ఈ మార్పులు మొదలవుతాయి. వీటి ప్రభావం మీ పర్సు మీద, మీ జీవితం మీద నేరుగా ప్రభావం చూపుతుంది. వీటిలో ఐదు ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చెక్ చెల్లింపు విధానం మారనున్నది.
ఇప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్తోపాటు వంట గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర చమురు సంస్థలు నిర్ణయించేవి. కానీ ఇక నుంచి ప్రతి నెలా మొదటి రోజే కేంద్ర చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను నిర్ణయిస్తాయి.
వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గనూ వచ్చు.. పెరుగనూ వచ్చు. దీని ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది.
జూన్ ఒకటో తేదీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఖాతాదారులు జారీ చేసే చెక్కుల చెల్లింపు విధానంలో మార్పు రానున్నది. మోసాల నుంచి ఖాతాదారులను రక్షించడమే బీవోబీ పాజిటివ్ పేమెంట్ విధానం.
ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల్లో భాగంగా ఎవరికైనా రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం చెక్ జారీ చేస్తే.. దాని వివరాలను పాజిటివ్ పే సిస్టమ్ ద్వారా బ్యాంక్ శాఖకు ధ్రువీకరించాలి.
పాజిటివ్ పే సిస్టమ్ ద్వారా.. చెక్ జారీ చేసిన ఖాతాదారు.. ఎలక్ట్రానిక్గా చెల్లింపులు జరిపేందుకు తన బ్యాంక్ శాఖకు కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలలో ఏదో ఒకదాని నుంచి సమాచారం ఇవ్వాలి.
ఆదాయం పన్నుశాఖ (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్ జూన్ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు పని చేయదు. జూన్ ఏడో తేదీన ఆదాయం పన్నుశాఖ.. ఆదాయం పన్ను చెల్లింపు దారుల కోసం నూతన ఈ-ఫైలింగ్ సైట్ను ప్రారంభిస్తుంది.
జూన్ ఏడో తేదీ నుంచి ఐటీఆర్ ఫైలింగ్ అధికారిక వెబ్సైట్ మారుతుందని ఆదాయం పన్నుశాఖ డైరెక్టరేట్ తెలిపింది. జూన్ 7 నుంచి http://INCOMETAX.GOV.IN వెబ్సైట్లో ఈ-ఫైలింగ్ చేయాలి. ఇప్పటి వరకు http://incometaxindiaefiling.gov.inలో పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించారు.
జూన్ ఒకటో తేదీ నుంచి గూగుల్లో అపరిమితంగా ఫొటోలను అప్లోడ్ చేయడం కుదరదు. ప్రతి జీ-మెయిల్ యూజర్కు గూగుల్ 15జీబీ వరకు స్పేస్ కల్పిస్తుంది. ఈ-మెయిల్స్తోపాటు ఫోటోలు, గూగుల్ డ్రైవ్ కలిపి గణిస్తారు. ఇంతకంటే ఎక్కువ స్టోర్ చేయాలని మీరు భావిస్తే తదనుగుణంగా చెల్లించాల్సిందే.
జూన్ ఒకటో తేదీ నుంచి దేశ రాజధాని ఢిల్లీతోపాటు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్డౌన్.. అన్లాక్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అన్లాక్ ప్రక్రియ చేపట్టడం వల్ల ప్రజలకు రిలీఫ్ లభిస్తుంది. అత్యధిక కేసులున్న సిటీల్లో స్వల్పంగా రిలీఫ్ లభిస్తుందని భావిస్తున్నారు.
టాటా గ్రూప్ చేతికి ఆన్లైన్ సరుకుల బిగ్ బాస్కెట్
సరికొత్త రికార్డు తాకిన నిఫ్టీ…
పేటీఎం భారీ ఐపీవో రూ.21,800 కోట్ల సమీకరణ
ఎన్ఐఏ అదుపులో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది
రాబర్ట్ వాద్రాకు ఊరట : ఐటీ నోటీసులపై బదులిచ్చేందుకు మరో మూడు వారాల గడువు
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఆయన ఓ ఫైవ్ స్టార్ పొలిటీషియన్ : బీజేపీ
2డీజీ డ్రగ్ సాచెట్ ఖరీదు రూ 990
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి
corona helpline : కరోనా బాధితుల కోసం హెల్ప్లైన్ నంబర్లు ఇవే..