న్యూఢిల్లీ : నల్ల ధన చట్టం కింద వ్యాపారి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఐటీ అధికారులు జారీ చేసని నోటీసులపై బదులిచ్చేందుకు ఆయనకు ఢిల్లీ హైకోర్టు మరో మూడు వారాల గడువు మంజూరు చేసింది. ఐటీ శాఖ పన్ను మదింపు ప్రక్రియను కొనసాగించవచ్చని అయితే తుది ఉత్తర్వులు మాత్రం వెలువరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
బ్లాక్ మనీ చట్టం కింద ఐటీ శాఖ తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వాద్రా దాఖలు చేసిన పిటిషన్ పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని కోరుతూ ఆదాయ పన్ను శాఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. బ్లాక్ మనీ చట్టం కింద తనకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపడం, షోకాజ్ నోటీసు జారీ చేయడం అసంబద్ధమని, చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ వాద్రా హైకోర్టును ఆశ్రయించారు.