బెంగళూరు : కర్ణాటక రాష్ట్రం తుమకూరులో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ బంగారు ఆభరణాల దుకాణంలో నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన ఉంగరాలు, హారాలు కనిపించకుండా పోయాయి. సిబ్బంది రోజువారీ పరిశీలనలో ఆభరణాలు కనిపించకుండా పోవడంతో అంతా గాబరాపడ్డారు. దీంతో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఆశ్చర్యకర ఘటన కనిపించింది.
తెల్లవారు జామున ఓ ఎలుక ప్రదర్శనల కోసం ఉంచిన చోట నుంచి ఒక్కొక్కటిగా ఉంగరాలు, ఆభరణాలను ఎత్తుకెళ్లడం కనిపించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా ఎలుక తవ్విన బొరియను గుర్తించారు. ఓ సీసీ కెమెరా ఆధారంగా ఆ బొరియను మొత్తం చూసి.. దాన్ని తవ్వారు. ఆ బొరియలోనే బంగారు ఆభరణాలు మొత్తం ఉండటంతో సిబ్బంది వాటిని జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు. ఎలుక ఆభరణాలు ఎత్తుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది.