ముంబై, మే 27: డిజిటల్ పేమెంట్స్ సర్వీసుల కంపెనీ పేటీఎం భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) రాబోతున్నది. ఈ ఆఫర్ ద్వారా రూ.21,800 కోట్లు సమీకరించనున్నట్లు ఈ లావాదేవీ సంబంధిత వర్గాలు తెలిపాయి. 2010లో కోల్ ఇండియా జారీచేసిన రూ.15,000 కోట్ల ఇష్యూ దేశంలో ఇప్పటివరకూ పెద్ద ఐపీవోకాగా, పేటీఎం అంతకుమించి నిధుల్ని మార్కెట్ నుంచి సమీకరించనుంది. ఐపీవోను దీపావళి పండుగ సీజన్లో జారీచేసి, నవంబర్నెలలో షేర్లను లిస్ట్చేయాలని యోచిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్టార్టప్ కంపెనీ అయిన పేటీఎంలో ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టరు వారెన్బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాథ్వేతో పాటు జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ గ్రూప్, చైనాకు చెందిన యాంట్ గ్రూప్లు ఇన్వెస్ట్చేశాయి. పేటీఎంను ప్రమోట్ చేసిన ఒన్97 కమ్యూనికేషన్స్ డైరెక్టర్ల బోర్డు ఐపీవో జారీకి ఆమోదం తెలిపేందుకు శుక్రవారం సమావేశంకానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవోకు లీడ్మేనేజర్లుగా మోర్గాన్స్టాన్లీ, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్లు వ్యవహరించనున్నాయి. పేటీఎంకు 2,500 కోట్ల డాలర్ల నుంచి 3,000 కోట్ల డాలర్ల విలువను ఒన్97 కమ్యూనికేషన్ ఆశిస్తోంది.