న్యూఢిల్లీ: పోస్టాఫీసు ప్రజలకు ఉపయోగపడే పలు పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్టాఫీసు పొదుపు పథకాలన్నీ సురక్షిత పెట్టుబడి మార్గాలుగా కాల పరీక్షకు నిలిచాయి. ఇతర పథకాలతో పోలిస్తే మెరుగైన ఫలితాలనిచ్చిన పథకాలుగా పోస్టాఫీసు పొదుపు పథకాలు ప్రజాదరణ పొందాయి.
వీటిల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్సీ) కాల పరీక్షకు నెగ్గిన ప్లాన్గా నిలిచింది. ఈ పథకంలో ఎటువంటి రిస్క్ లేకుండా మీరు కొన్నేండ్లలోనే భారీ మొత్తంలో మనీ సంపాదించొచ్చు. సురక్షితమైన మీ కుటుంబ భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ స్కీమ్ బెనిఫిట్లు ఏమిటో చూద్దామా..!
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ ఐదేండ్లు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏడాది తర్వాత మీ ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద వడ్డీరేట్లు ప్రతి త్రైమాసికానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తుంది.
మీరు ఈ పథకం కింద ప్రతి నెలా కనిష్ఠంగా రూ.100 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఐదేండ్ల తర్వాత ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందాలంటే అంతే మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి.
ఉదాహరణకు 6.8 శాతం వడ్డీరేటుపై ఐదేండ్ల తర్వాత రూ.20.85 లక్షలు పొందాలని మీరు భావిస్తున్నారని అనుకుందాం.. అయితే, ఐదేండ్లలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాలి. దీనిపై సుమారు రూ.6 లక్షల వడ్డీ లాభంగా కలిసి వస్తుంది. అంటే ఏటా రూ.3 లక్షలు మదుపు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్పై 6.8 శాతం వడ్డీరేటు వస్తుంది. ఇది ప్రతి ఏటా కలుస్తూ మెచ్యూర్ అయిన తర్వాత చెల్లిస్తారు. ప్రతి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేటు కంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కింద ఎక్కువ.
ప్రస్తుతం బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5-6 శాతం వడ్డీ అందిస్తున్నారు. అంతే కాదు.. ఆదాయం పన్ను చట్టం (ఐటీ) 80 సీ సెక్షన్ కింద ఈ పథకంపై రూ.1.5 లక్షల మదుపు వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఐదేండ్లలోపు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ముందస్తుగా క్లోజ్ చేయరు. సింగిల్ ఖాతాదారు లేదా జాయింట్ ఖాతాలో సభ్యులంతా మరణిస్తే ఆ డబ్బు ముందే విత్ డ్రా చేసుకోవచ్చు. దానికి గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరణతోపాటు కోర్టు ఆదేశాలు అవసరం.
ఏడాది తర్వాత నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఖాతా క్లోజ్ చేయొచ్చు. కానీ డిపాజిట్ తేదీ నుంచి మూడేండ్ల లోపు జరుగాలి. ముందస్తుగా విత్ డ్రాయల్ చేస్తే అప్పటి వరకు మదుపు చేసిన మొత్తం, దానిపై వడ్డీ అప్పటి పోస్టాఫీసు పొదుపు ఖాతా వడ్డీ ఆధారంగా గణించి చెల్లిస్తారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఇండియాలో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత? త్వరలో మరో కమిటీ ఏర్పాటు!!
గుజరాతీలకు మారుతి అండ: సీతాపూర్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన
క్రెడిట్ కార్డుల వాడకంతో ఇలా రివార్డు పాయింట్లు..!
అత్యంత ఖరీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..
పీపీఎఫ్లో రూ.12 వేల మదుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..
కొవిడ్-19 ఆంక్షలు: బ్యాంకింగ్ పని వేళలు కుదింపు!
సెకండ్ వేవ్ తాకితే సెకండ్ లైఫ్ లేనట్టే